తెలంగాణ

telangana

By

Published : Apr 18, 2022, 4:19 PM IST

ETV Bharat / sukhibhava

బీపీ, షుగర్ ఉందా? కిడ్నీలకు ముప్పే! ఇలా జాగ్రత్తపడండి!!

KIDNEY HEALTH TIPS: శరీరంలోని మలినాలను లేదా విషపూరితాలను బయటకు పంపించి ఆరోగ్యాన్ని కాపాడేవి మూత్రపిండాలు. వాటి పనితీరు సక్రమంగా ఉండాలంటే మనం కూడా వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకోకం కిడ్నీలపై ఒత్తిడి పడకుండా సరైన ఆహారం తీసుకోవడమే మనం చేయాల్సిన ముఖ్యమైన పని. మరి మన కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసుకుందాం.

KIDNEY HEALTH TIPS
KIDNEY HEALTH TIPS

KIDNEY HEALTH TIPS: మూత్రపిండాలు.. శరీరంలోని మలినాలను బయటకు పంపించి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. మనం తీసుకున్న ఆహారంలో ఎన్నో రకాల రసాయనాలు ఉంటాయి. ఈ రసాయనాలు మన శరీరంలో ఎక్కువైనా, తక్కువైనా ప్రమాదమే. వాటిని నియంత్రణలో ఉంచేలా కిడ్నీలు వ్యవహరిస్తాయి. అయితే కిడ్నీలపై ఒత్తిడి పడకుండా ఉండాలంటే ఆయా రసాయనాలు కలిగిన ఆహారాన్ని తగిన మోతాదులో తీసుకోవడం ముఖ్యం. దీని వల్ల కిడ్నీల పనితీరు మెరుగుపడుతుంది. క్రోనిక్ కిడ్నీ డిసీజ్​లు ఉన్నవారు కచ్చితంగా మూత్రపిండాల విషయంలో అధిక జాగ్రత్తలు తీసుకోవాలి. వీరు తమ ఆహారంలో తప్పక మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. సోడియం, మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం, పాస్ఫరస్ ఉండే ఫ్రెండ్లీ డైట్ తీసుకోవడం మంచిది.

డయాబెటిస్ ఉందా?:కిడ్నీల పనితీరు బాగుంటే.. శరీరంలో జరిగే ప్రక్రియలు సాధారణంగా ఉంటాయి. రక్తంలో ఉండే షుగర్​ను కిడ్నీలు ఫిల్టర్ చేస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువైతే కిడ్నీలపై ఒత్తిడి పడుతుంది. డయాబెటిస్ వంటి వ్యాధులు వస్తే.. కొద్దికాలం తర్వాత కిడ్నీలు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. ఈ నేపథ్యంలో డయాబెటిస్ వచ్చినప్పుడు షుగర్ స్థాయిలను నియంత్రించుకోవాలి. వ్యాయామం తప్పనిసరిగా చేస్తూ ఉండాలి.

ఉప్పు తినకూడదా?:అధిక రక్త పోటు సైతం కిడ్నీల వైఫల్యానికి దారితీస్తాయి. అందుకే ఉప్పు తగిన మోతాదులో తీసుకోవాలి. అధిక రక్త పోటు ఉన్నవారు.. సగం చెంచా కన్నా ఎక్కువ ఉప్పు తీసుకోకూడదని వైద్యులు చెబుతున్నారు. కూరగాయలు, పప్పుల్లో తప్పితే మిగతా వాటిల్లో ఉప్పు వాడకుండా ఉండేందుకు ప్రయత్నించాలి. ఉదయం వాడే ఇడ్లీ, దోశ పిండిలో ఉప్పు మానేయాలి. మధ్యాహ్నం, రాత్రి భోజనానికి ఒక్కోగ్రాము చొప్పున ఉప్పు మాత్రమే తీసుకోవాలి.

పాస్ఫరస్, కాల్షియం కోసం...:శరీరానికి పాస్ఫరస్, కాల్షియం చాలా అవసరం. తాజా పండ్లు, కూరగాయలు, మొక్కజొన్న, మాంసం, చేపలు, పాల ఉత్పత్తులు వంటి ఆహారాల పదార్థాల ద్వారా పాస్ఫరస్, కాల్షియాన్ని శరీరానికి అందించవచ్చు. అయితే, వీటినీ అధిక మోతాదులో తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. అదే సమయంలో కాల్షియం ట్యాబ్లెట్లను వైద్యుల సూచన లేకుండా ఉపయోగించవద్దని స్పష్టం చేస్తున్నారు.

కిడ్నీలు మెరుగ్గా ఉండాలంటే...
• రోజుకు కనీసం మూడు లీటర్ల నీరు తాగాలి.
• ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి.
• రాజ్మా ఉడికించిన నీళ్లు, గోరువెచ్చని నీళ్లు తాగితే కిడ్నీలకు మంచిది. అనవసరమైన లవణాలను శరీరం నుంచి బయటకు పంపించేందుకు ఇవి ఉపయోగపడతాయి.
• బీపీ, డయాబెటిస్​ను నియంత్రణలో ఉంచుకోవాలి.
• వేసవి కాలంలో నిమ్మకాయ నీళ్లు, కొబ్బరి నీళ్లు తాగుతుండాలి.
• చలికాలంలో టమాట సూప్, పాలకూర సూప్, కూరగాయల సూప్ తాగాలి.
• నొప్పి మాత్రలు చాలా వరకు వాడకుండా ఉండటమే మంచిది.
• పొటాషియం కోసం కూరగాయలు, ఆలూ, అరటిపండ్లు అవకాడో, కమలాపండ్లు, టమాటాలు, క్యారెట్లు తీసుకోవాలి. ఆపిల్స్, కాన్​బెర్రీ, స్ట్రాబెర్రీస్, బ్లూబెర్రీస్, క్యాబేజీ, కాలీఫ్లవర్, దోసకాయల్లో పరిమితంగా పొటాషియం ఉంటుంది. వీటిని తీసుకోవడం ద్వారా శరీరానికి కావాల్సిన పొటాషియంను అందించవచ్చు. అదే సమయంలో కిడ్నీలపై అధిక ఒత్తిడి లేకుండా చూసుకోవచ్చు.

ఇదీ చదవండి:Anemia Hair Fall: ఇవి పాటిస్తే మీ జుట్టు రాలదు!

ABOUT THE AUTHOR

...view details