తెలంగాణ

telangana

ETV Bharat / state

బావిలో మునిగి యువకుడి దుర్మరణం

యాదాద్రి భువనగిరి జిల్లా గంగాపురం గ్రామంలో వ్యవసాయ బావికి ఈతకు వెళ్లి రాహుల్​ అనే యువకుడు మృతి చెందాడు. యువకుడు మృతి చెందటం వల్ల కుటుంబంలో విషాదఛాయలు నెలకొన్నాయి.

By

Published : May 17, 2020, 4:21 PM IST

Young men swims to farm well and dies in Yadadri Bhunagiri district
బావిలో ఈతకు వెళ్లి యువకుడు మృతి

యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం గంగాపురం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన చీనురి రాహుల్ స్నేహితులతో కలిసి గ్రామ శివారులోని ఓ వ్యవసాయ బావిలో ఈతకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు నీటమునిగి ఎంతకు బయటకు రాకపోయే సరికి స్నేహితులు ఆందోళనకు గురయ్యారు. హుటాహుటినా గ్రామస్థులకు సమాచారం అందించారు.

ఘటనా స్థలానికి చేరుకొన్న గ్రామస్థులు కరెంట్​ మోటర్ల సాయంతో బావిలోని నీటినంతా తోడి మృతదేహాన్ని బయటకు తీశారు. ఎదిగి వచ్చిన కుమారుడు విగతజీవిగా మారటం వల్ల కుటుంబంలో విషాదఛాయలు నెలకొన్నాయి. తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శవపరీక్ష నిమిత్తం ఆలేరు ప్రభుత్వాసుపత్రికి మృతదేహాన్ని తరలించారు.

ABOUT THE AUTHOR

...view details