తెలంగాణ

telangana

ETV Bharat / state

విద్యుత్ సరఫరా లేక పోలింగ్ అరగంట ఆలస్యం - విద్యుత్ సరఫరా లేక అరగంట ఆలస్యంగా పోలింగ్

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మున్సిపాలిటీలోని కొన్ని పోలింగ్ కేంద్రాల్లో విద్యుత్ సరఫరా లేక, మరికొన్ని చోట్ల వీల్​చైర్లు లేక ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విద్యుత్ లేకపోవడం వల్ల పోలింగ్ అరగంట ఆలస్యంగా ప్రారంభమైంది.

no power
విద్యుత్ సరఫరా లేక అరగంట ఆలస్యంగా పోలింగ్

By

Published : Jan 22, 2020, 10:46 AM IST

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మున్సిపాలిటీల్లోని కొన్ని పోలింగ్ కేంద్రాల్లో విద్యుత్ సరఫరా లేక పోలింగ్ అరగంట ఆలస్యంగా ప్రారంభమైంది. మరికొన్ని పోలింగ్ కేంద్రాల్లో సరైన సౌకర్యాలు లేక బీఎల్​వీఓ సిబ్బంది, వీల్​ ఛైర్లు లేక వికలాంగులు చాలా ఇబ్బందులు పడ్డారు.

యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో ఎన్నికలు జరుగుతున్న 12 వార్డుల్లో 48 మంది పోటీలో ఉన్నారు. 12 వార్డులకు గాను 24 పోలింగ్ బూతులు ఏర్పాటు చేశారు. మొత్తం 15 వేల 637 మంది ఓటర్లు ఈ రోజు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

విద్యుత్ సరఫరా లేక అరగంట ఆలస్యంగా పోలింగ్

ఇవీ చూడండి: హలో ఓటర్​.. ఓటేస్తూ సెల్ఫీలు వద్దు!

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details