తెలంగాణ

telangana

ETV Bharat / state

త్వరలోనే ఆలయానికి అష్టదిక్పాలకుల విగ్రహాలు: యాడా - telangana news

యాదాద్రి ప్రధాన ఆలయం వద్ద, బయటివైపు శాలహారాలలో వివిధ రకాల దేవతామూర్తులు విగ్రహాలను పొందుపరుస్తున్నట్లు యాడా అధికారులు తెలిపారు. త్వరలోనే ఆలయానికి అష్టదిక్పాలకుల విగ్రహాలు ఆలయానికి రానున్నట్లు వెల్లడించారు.

yadadri temple construction
త్వరలోనే ఆలయానికి అష్టదిక్పాలకుల విగ్రహాలు: యాడా

By

Published : Apr 23, 2021, 9:37 AM IST

యాదాద్రి పుణ్య క్షేత్రాన్ని అత్యంత అద్బుతంగా తీర్చిదిద్దేందుకు యాాడ ప్రత్యేక శ్రద్ధ వహిస్తోంది. ఇప్పటికే కృష్ణ శిలతో ఆలయంలో విష్ణుమూర్తి అవతారాలు, నరసింహుని రూపాలు, దశావతార, వివిధ దేవాతామూర్తుల రాతి విగ్రహాలు పొందుపరిచింది.

ప్రస్తుతం దేవస్థానంలో అష్టదిక్పాలకుల విగ్రహాలను ప్రతిష్టించేందుకు యాడ చర్యలు చేపట్టింది. త్వరలోనే ఆలయానికి విగ్రహాలు రానున్నాయని అధికారులు తెలిపారు. అన్ని విగ్రహాలు వచ్చాక ధ్వజస్తంభాన్ని అనుసంధానం చేసుకొని ప్రధానాలయంలోని గర్భాలయం చుట్టూ ప్రతిష్టిస్తామని వెల్లడించారు. ప్రధాన ఆలయం వద్ద, బయటి వైపు శాలహారాలలో వివిధ రకాల దేవతామూర్తుల విగ్రహాలను పొందుపరిచే పనులు జరుగుతున్నట్లు పేర్కొన్నారు.

ఇదీ చూడండి:కరోనా కట్టడికి పకడ్బందీగా రాత్రి కర్ఫ్యూ

ABOUT THE AUTHOR

...view details