తెలంగాణ ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం హుండీల లెక్కింపు చేపట్టారు. 26 రోజుల హుండీ ఆదాయం రూ. 65 లక్షల 40 వేల 739 నగదు, 49 గ్రాముల బంగారం, 1 కిలో 850 గ్రాముల వెండి వచ్చినట్లుగా ఆలయ కార్యనిర్వహణాధికారి గీత రెడ్డి, యాదాద్రి దేవస్థానం అధికారులు తెలియజేసారు.
యాదాద్రి ఆలయ హుండీ లెక్కింపు.. - యాదాద్రి ఆలయం తాజా వార్తలు
ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం హుండీ లెక్కించారు. 26 రోజుల ఆలయ హుండీ ఆదాయం 65 లక్షల 40 వేలకు పైగా నగదు వచ్చినట్లుగా ఆలయ అధికారులు తెలిపారు. ఈ హుండీ లెక్కింపులో కరోనా నిబంధనలు పాటిస్తూ నిర్వహించారు.

26 రోజుల యాదాద్రి ఆలయ హుండీ లెక్కింపు..
ఈ హుండీ లెక్కింపులో మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించారు. చేతులకు గ్లౌజ్లు ధరించి హుండీ లెక్కింపు చేపట్టారు. ఈ కార్యక్రమం ఆలయ ఆధికారుల పర్యవేక్షణలో కొనసాగింది.
ఇదీ చదవండి:ప్రశాంతత పరిఢవిల్లేలా... ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసేలా