తెలంగాణ

telangana

ETV Bharat / state

యాదాద్రి ఆలయ హుండీ లెక్కింపు..

ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం హుండీ లెక్కించారు. 26 రోజుల ఆలయ హుండీ ఆదాయం 65 లక్షల 40 వేలకు పైగా నగదు వచ్చినట్లుగా ఆలయ అధికారులు తెలిపారు. ఈ హుండీ లెక్కింపులో కరోనా నిబంధనలు పాటిస్తూ నిర్వహించారు.

By

Published : Nov 17, 2020, 7:39 PM IST

26 రోజుల యాదాద్రి ఆలయ హుండీ లెక్కింపు..
26 రోజుల యాదాద్రి ఆలయ హుండీ లెక్కింపు..

తెలంగాణ ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం హుండీల లెక్కింపు చేపట్టారు. 26 రోజుల హుండీ ఆదాయం రూ. 65 లక్షల 40 వేల 739 నగదు, 49 గ్రాముల బంగారం, 1 కిలో 850 గ్రాముల వెండి వచ్చినట్లుగా ఆలయ కార్యనిర్వహణాధికారి గీత రెడ్డి, యాదాద్రి దేవస్థానం అధికారులు తెలియజేసారు.

హుండీ లెక్కిస్తున్న ఆలయ సిబ్బంది

ఈ హుండీ లెక్కింపులో మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించారు. చేతులకు గ్లౌజ్​లు ధరించి హుండీ లెక్కింపు చేపట్టారు. ఈ కార్యక్రమం ఆలయ ఆధికారుల పర్యవేక్షణలో కొనసాగింది.

ఇదీ చదవండి:ప్రశాంతత పరిఢవిల్లేలా... ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసేలా

ABOUT THE AUTHOR

...view details