తెలంగాణ

telangana

ETV Bharat / state

శరవేగంగా యాదాద్రి ఆలయ పునఃనిర్మాణ పనులు - యాదాద్రి ఆలయం

అణువణువూ భక్తిభావం ఉట్టిపడేలా యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం రూపుదిద్దుకుంటోంది. ప్రాకారాలపై అద్భుతమైన శిల్పకళా సౌందర్యం, నల్లరాతి గోడలపై కన్నుల పండువగా ఉండే దేవతల రూపాలు, హంసల నృత్యాలు, జింకల సయ్యాటలు, ఐరావతాలు కొలువు దీరాయి. స్వామి దర్శనానికి భక్తులు మళ్లీ మళ్లీ వచ్చేలా అన్ని హంగులతో ఆలయం పునర్నిర్మితమవుతోంది.

yadadri reconstruction works is to be completed
శరవేగంగా యాదాద్రి ఆలయ పునఃనిర్మాణ పనులు

By

Published : Nov 12, 2020, 10:26 AM IST

యాదాద్రి ఆలయ నిర్మాణ పనులు శరవేగంగా పూర్తవుతున్నాయి. అణువణువూ ఆధ్యాత్మిక భావాన్ని పెంపొందించేలా అద్భుతమైన శిల్పకళా సౌందర్యంతో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం రూపుదిద్దుకుంటోంది. ప్రాకారాలలోని శిల్పాలు తుది మెరుగులు దిద్దుకుంటున్నాయి.

శరవేగంగా యాదాద్రి ఆలయ పునఃనిర్మాణ పనులు

క్షేత్ర అభివృద్ధి పనులను మరో 2 లేదా 3 నెలల్లో పూర్తి చేయాలనే సీఎం కేసీఆర్​ దిశానిర్దేశం మేరకు ప్రధాన ఆలయ పనులను ప్రధాన స్తపతి పర్యవేక్షణలో అధికారులు వేగవంతం చేశారు. స్వామి కొలువై ఉన్న మాడ వీధుల్లో ఫ్లోరింగ్​ పనులను గడువులోగా పూర్తి చేసేందుకు శ్రమిస్తున్నారు.

శరవేగంగా యాదాద్రి ఆలయ పునఃనిర్మాణ పనులు

ఆలయ వెలుపలి ప్రాకార మండపంపై ఉన్న సాలహారాల్లో విష్ణుమూర్తి విగ్రహాల ఏర్పాటుకు త్వరలోనే శ్రీకారం చుట్టనున్నారు.

ఇదీ చదవండి:మరోసారి ఉదారత చాటుకున్న సోనూసూద్

ABOUT THE AUTHOR

...view details