తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో నిరాడంబరంగా జరిగాయి. స్తానిక పురపాలక కార్యాలయం ఎదుట ఛైర్ పర్సన్ వేం రెడ్డి రాజు జాతీయ పతాకం ఆవిష్కరించారు. అమర వీరులకు నివాళి అర్పించారు. మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎంపీపీ వెంకట్ రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణా రాష్ట్ర సాధన కోసం ప్రాణ త్యాగం చేసిన అమరులను స్మరించుకుంటూ శ్రద్ధాంజలి ఘటించారు.
త్యాగాలను స్మరిస్తూ..