తెలంగాణ

telangana

శేషవాహనంపై ఊరేగిన లక్ష్మీనరసింహస్వామి

By

Published : Feb 29, 2020, 10:37 AM IST

యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు కోలాహలంగా సాగుతున్నాయి. మూడో రోజున స్వామివారిని బాలాలయంలో ఊరేగించారు.

YADADRI BRAHMOSTAVALU 3RD DAY CELEBRATIONS
YADADRI BRAHMOSTAVALU 3RD DAY CELEBRATIONS

ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. వేడుకల్లో భాగంగా మూడోరోజు స్వామివారిని శేషవాహనంపై ఊరేగించారు.

స్వామివారిని నయనమనోహరంగా, వజ్రవైఢూర్యాలతో, వివిధ రకాల పుష్పాలతో అలంకరించి వేదమంత్రాలు, మంగళవాద్యాల నడుమ కోలాహలంగా... బాలాలయంలో ఊరేగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ క్రతువులో భక్తులు పెద్దఎత్తున పాల్గొన్నారు. మార్చి 3న ఎదుర్కోలు‌, 4న తిరుకల్యాణం, 5న రథోత్సవం నిర్వహించనున్నారు.

శేషవాహనంపై ఊరేగిన లక్ష్మీనరసింహస్వామి

ఇదీ చదవండి:ప్రతి నీటి బొట్టు అమూల్యమైనదే: మంత్రి కేటీఆర్

ABOUT THE AUTHOR

...view details