తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రభుత్వ క్వారంటైన్​కు మహిళ తరలింపు - అంబులెన్స్ డ్రైవర్​కు కరోనా పాజిటివ్

యాదాద్రి భవనగిరి జిల్లా గోవింద్​తండాకు చెందిన ఓ మహిళను ప్రభుత్వ క్వారంటైన్​కు తరలించారు. చికిత్స కోసం హైదరాబాద్​కు వెళ్లి వచ్చిన అంబులెన్స్​ డ్రైవర్​కు కరోనా పాజిటివ్​ రావడం వల్ల అధికారులు అప్రమత్తమయ్యారు.

women shifted to quarantine in govindthanda
ప్రభుత్వ క్వారంటైన్​కు మహిళ తరలింపు

By

Published : Apr 30, 2020, 12:55 PM IST

కరోనా నివారణకు యాదాద్రి భువనగిరి జిల్లా అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా బొమ్మలరామారం మండలం గోవింద్​తండాకు చెందిన నలుగురు వ్యక్తులను ప్రభుత్వ క్వారంటైన్​కు తరలించారు. తండాకు చెందిన గర్భిణీని ఈ నెల 22న చికిత్స కోసం హైదరాబాద్​లోని ఓ ఆసుపత్రికి తరలించారు. తిరుగుప్రయాణంలో 102 వాహనంలో ఇంటికి తీసుకువచ్చారు.

సంబంధిత అంబులెన్స్​ డ్రైవర్​కు నిన్న కరోనా పాజిటివ్​ వచ్చింది. వాహనంలో ప్రయాణించిన వారికి పరీక్షలు నిర్వహించి ప్రభుత్వ క్వారంటైన్​కు తరలించారు. మండల ప్రజలెవరూ కరోనా విషయంలో ఆందోళనకు గురికావద్దని ఎస్సై మధుబాబు సూచించారు. లాక్​డౌన్​లో భాగంగా ప్రతి ఒక్కరూ స్వీయ నిర్బంధం పాటించాలన్నారు.

ఇదీ చూడండి:ఇర్ఫాన్​ఖాన్​కు సైకత శిల్పంతో ఘననివాళి

ABOUT THE AUTHOR

...view details