తెలంగాణ

telangana

ETV Bharat / state

యాదాద్రిని పర్యాటక కేంద్రంగానూ తీర్చిదిద్దుతాం: మంత్రులు - యాదాద్రి జిల్లా వార్తు

యాదాద్రిని ఆధ్యాత్మికంగానే కాకుండా పర్యాటకంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. హైదరాబాద్‌కు సమీపంలో ఉండటం వల్ల దివ్యక్షేత్రం భవిష్యత్‌కు ఢోకాలేదని మంత్రులు స్పష్టం చేశారు. యాదాద్రి ఆలయ పునర్నిర్మాణంలో భాగస్వాములైన వారిని అమాత్యులు ఘనంగా సన్మానించారు. సీఎం కేసీఆర్‌ సంకల్పం వల్లే భవ్యమందిరం సాధ్యమైందని పునరుద్ఘాటించారు.

telangana ministers at yadadri
telangana ministers at yadadri

By

Published : Apr 4, 2022, 6:07 AM IST

యాదాద్రిని అన్నివిధాలా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తోందని మంత్రులు ఇంద్రకరణ్​రెడ్డి, జగదీశ్​రెడ్డి స్పష్టం చేశారు. యాదాద్రిలో పర్యటించిన మంత్రులు.. తొలుత స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. భవ్యమందిరం పునర్నిర్మాణంలో పాలుపంచుకున్న అధికారులు, ఇంజినీర్లు, ఇతర సిబ్బందిని ఆత్మీయ సత్కారం చేశారు. యాదాద్రిని ఆధ్యాత్మిక క్షేత్రంగానే కాకుండా... పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్​ దార్శనికత వల్లే అద్భుత యాదాద్రి నిర్మాణం సాకారమైందన్నారు. పునర్నిర్మాణంలో పాలుపంచుకున్న అధికారులు, ఇంజినీర్ల సేవలను మంత్రి కొనియాడారు.

యాదాద్రి పర్యటన తర్వాత తిరుగు పయనమైన మంత్రి జగదీశ్​రెడ్డిని యాదగిరిగుట్టలో ఆటో కార్మికులు, స్థానికులు అడ్డుకున్నారు. కొండపైకి ఆటోలను అనుమతించకపోవడం వల్ల తమ జీవనోపాధి దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆటో కార్మికులను పోలీసులు అడ్డుకోగా.. స్వల్ప తోపులాట జరిగింది. సమస్యను పరిష్కరిస్తానన్న మంత్రి జగదీశ్‌రెడ్డి హామీతో ఆటో కార్మికులు ఆందోళన విరమించారు

నారసింహుని దర్శనానికి వచ్చిన భక్తజనంతో యాదాద్రి సన్నిధి కోలాహలంగా మారింది. వరుస సెలవులు రావడం వల్ల సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన యాత్రికులతో క్షేత్రపరిసరాలు కిక్కిరిశాయి. క్యూలైన్లు, ప్రసాదాల కౌంటర్, కొండ కింద పుష్కరిణి, కల్యాణ కట్ట వద్ద భక్తుల రద్దీ కనిపించింది.

ఇదీచూడండి:కొండపైకి అన్ని వాహనాలను అనుమతించాలి.. స్థానికుల ఆందోళన

ABOUT THE AUTHOR

...view details