తెలంగాణ

telangana

ETV Bharat / state

'ప్రలోభాలకు లొంగకుండా ఓటు వేయాలి'

ఈనాడు-ఈటీవీ భారత్​ ఆధ్వర్యంలో... మోత్కూరు సాయిరామ్ డిగ్రీ కళాశాలలో ఓటరు అవగాహన సదస్సు నిర్వహించారు. విద్యార్థులు ఓటుహక్కు సద్వినియోగం చేసుకోవాలని వక్తలు సూచించారు.

By

Published : Jan 12, 2020, 12:48 PM IST

'ప్రలోభాలకు లొంగకుండా ఓటు వేయాలి'
'ప్రలోభాలకు లొంగకుండా ఓటు వేయాలి'

యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీలోని సాయిరామ్​ డిగ్రీ కళాశాలలో ఈనాడు-ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో ఓటరు అవహాన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తహసీల్దార్ అహ్మద్, ఎన్నికల అధికారి మనోహర్ రెడ్డి హాజరయ్యారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటుహక్కుకు అర్హులేనని... నమోదు చేసుకోవాలని సూచించారు.

ఎంతో విలువైన ఓటుహక్కును ఓ ఆయుధంలా ఉపయోగించుకోవాలన్నారు. అభ్యర్థులు చూపించే ప్రలోభాలకు లోనుకాకుండా... నిజాయితీగా వేయాలన్నారు. మోత్కూరు మున్సిలిటీ మొదటి పాలకవర్గాన్ని ఎన్నుకునే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

'ప్రలోభాలకు లొంగకుండా ఓటు వేయాలి'

ఇదీ చూడండి: కేసీఆర్​తో సమానమైన పదవిలో ఉంటానేమో: జితేందర్​రెడ్డి

ABOUT THE AUTHOR

...view details