యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి ప్రజలు స్వచ్ఛందంగా లాక్డౌన్ పాటిస్తున్నారు. వ్యాపార వాణిజ్య సముదాయాలు మూతపడ్డాయి. కరోనా నివారణకు తమ వంతుగా స్వచ్ఛంద లాక్డౌన్ పాటించి జిల్లాలోని మిగిలిన పట్టణాలకు ఆదర్శంగా నిలిచారు పోచంపల్లి వాసులు. శని, ఆదివారం కూడా లాక్డౌన్ పాటించనున్నారు.
స్వచ్ఛందంగా లాక్డౌన్ విధించుకున్న పోచంపల్లివాసులు - lockdownr in yadadribhuvanagiri district
రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. వైరస్తో మృతి చెందిన వారి సంఖ్య కూడా పెరుగుతోంది. యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లిలో బుధవారం రాత్రి ఓ వ్యక్తి కరోనా లక్షణాలతో మృతి చెందాడనే అనుమానంతో పట్టణ వాసులు, వ్యాపారస్తులు స్వచ్ఛందంగా లాక్డౌన్ పాటించాలని నిర్ణయించారు.
![స్వచ్ఛందంగా లాక్డౌన్ విధించుకున్న పోచంపల్లివాసులు voluntary lockdown at pochampally in yadadribhuvanagiri district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7785531-thumbnail-3x2-nds.jpg)
స్వచ్ఛందంగా లాక్డౌన్ విధించుకున్న పోచంపల్లివాసులు
ప్రజలు అప్రమత్తంగా ఉండి బయటకు రాకుండా ఇళ్లలోనే ఉండాలని పోచంపల్లి మున్సిపల్ అధికారులు విజ్ఞప్తి చేశారు. తప్పనిసరిగా బయటకు రావాల్సి వస్తే కచ్చితంగా మాస్కు ధరించాలన్నారు. లేనియెడల రూ.1000 జరిమానా విధించనున్నట్లు చెప్పారు.
ఇదీ చదవండి:వారికి స్మార్ట్ఫోన్లే లేవ్- మరి ఆన్లైన్లో చదువెలా?