తెలంగాణ

telangana

ETV Bharat / state

పిడుగుపాటుకు రెండు గేదెలు మృతి - yadadri bhuvanagiri district news

పిడుగుపాటుకు రెండు పాడి గేదెలు మృతి చెందిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం చాడ గ్రామంలో చోటుచేసుకుంది. ప్రభుత్వం ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలని బాధిత రైతు వేడుకుంటున్నాడు.

Two buffaloes killed by lightning strike in yadadri bhuvanagiri district
పిడుగుపాటుకు రెండు గేదెలు మృతి

By

Published : May 31, 2020, 9:49 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలంలో భారీ వర్షం కురిసింది. మోటకొండూరు మండలంలోని చాడ గ్రామానికి చెందిన అబ్రహం అనే రైతుకు చెంది రెండు పాడి గేదెలు పిడుగుపాటుకు మృత్యువాత పడ్డాయి. వాటి విలువ సుమారు 90 వేల రూపాయలు ఉంటుందని బాధితుడు తెలిపాడు. వారి పాడి గేదెలు మృత్యువాత పడడం వారి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ప్రభుత్వం ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలని రైతు అబ్రహం వేడుకుంటున్నాడు.


ఇవీ చూడండి: విద్యుదాఘాతంతో పొలం వద్దే రైతు మృతి

ABOUT THE AUTHOR

...view details