తెలంగాణ

telangana

నారసింహుని కళ్యాణానికి తితిదే పట్టువస్త్రాలు

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా నిర్వహిస్తున్నారు. స్వామివారి కళ్యాణానికి తిరుమల తిరుపతి దేవస్థానం వారు పట్టు వస్త్రాలు సమర్పించారు.

By

Published : Mar 22, 2021, 2:10 PM IST

Published : Mar 22, 2021, 2:10 PM IST

ttd silks for yadadri Narasimha's marriage
నారసింహుని కళ్యాణానికి తితిదే పట్టువస్త్రాలు

ప్రముఖ పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహుని వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా కల్యాణ మహోత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.

ఉత్సవంలో భాగంగా స్వామి, అమ్మవార్లకు తిరుమల తిరుపతి దేవస్థానం వారు... ఆలయ ఈవో గీతా రెడ్డికి పట్టు వస్త్రాలు అందించారు. పట్టు వస్త్రాలకు అష్టోత్తర మండపం వద్ద శాస్త్రోక్తంగా అర్చకులు పూజలు చేపట్టారు.

ఇదీ చూడండి:లక్ష్మీనరసింహుని కల్యాణమహోత్సవానికి ముహూర్తం

ABOUT THE AUTHOR

...view details