యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం చోక్ల తండాలో వరి కంది పంటలను శిక్షణ సహాయ కలెక్టర్ గరిమా అగర్వాల్ పరిశీలించారు. గ్రామ పంచాయతీ పరిధిలో సాగు చేసిన విత్తనోత్పత్తి పంటల తీరును గమనించారు. వ్యవసాయ అధికారులు, రైతులతో కలిసి క్షేత్రస్థాయిలో పంటలను సందర్శించారు. విత్తన ఉత్పత్తి పథకం ద్వారా చేకూరే, ప్రయోజనాలను వ్యవసాయశాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. రైతుబంధు, రైతు బీమా, లబ్ధిదారులతో మాట్లాడి వారి అభిప్రాయాలను సేకరించారు.
అప్రమత్తంగా ఉండాలి...