యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం గ్రామ శివారులో 65వ నంబరు జాతీయ రహదారిపై 11 కె.వి విద్యుత్ వైరు తెగిపడిపోయింది. నడిరోడ్డుపై విద్యుత్ తీగలు పడి ఉన్న విషయం గమనించిన స్థానికులు భయంతో అక్కడే ఆగిపోయారు. వాహనదారులు కూడా అక్కడే వాహనాలను నిలిపేశారు. చాలా సేపు ట్రాఫిక్ స్తంభించిపోయింది. స్థానికులు ట్రాన్స్కో అధికారులకు సమాచామిచ్చారు. వెంటనే సరఫరా నిలిపివేసి విద్యుత్ తీగలను తొలగించారు.
తెగిపడిన విద్యుత్ తీగలు... ట్రాఫిక్కు అంతరాయం
నడిరోడ్డుపై విద్యుత్ తీగలు తెగిపడిపోయాయి. విషయం గుర్తించిన వాహనదారులు వాహనాలను నిలిపివేసి అక్కడే ఉండిపోయారు.
తెగిపడిన విద్యుత్ తీగలు... ట్రాఫిక్కు అంతరాయం