యాదిగిరిగుట్టలో దొంగల కలకలం
తాళం వేసి ఉన్న ఇంటిని దొంగలు దోచేశారు. పక్క గ్రామానికి వెళ్లివచ్చేలోపే ఉన్నదంతా ఊడ్చేశారు. ఈ ఘటన యాదగిరి గుట్టలో చోటుచేసుకుంది.
thieves halchal in yadagirigutta
యాదగిరిగుట్టలో దొంగలు కలకలం సృష్టించారు. శివరాత్రి ఐలయ్య అనే వ్యక్తి ఇంట్లో దొంగలు పడి ఉన్నదంతా దోచుకెళ్లారు. ఇంటికి తాళం వేసి ఉండటాన్ని గమనించిన దుండగులు... తాళం పగులగొట్టారు. తులం బంగారంతో పాటు దాదాపు రూ. 45 వేలు చోరీకి గురైనట్టు బాధితులు వాపోయారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి వివరాలు సేకరిస్తున్నారు.