ప్రజలు తెరాస పాలనతో విసిగిపోయి... భాజపా వైపు చూస్తున్నారని పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కె.లక్ష్మణ్ పేర్కొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని పట్టణ శివార్లలో నూతనంగా నిర్మించనున్న పార్టీ నూతన కార్యాలయం భూమి పూజకు ఆయన హాజరయ్యారు.
పార్టీ కార్యాలయాలు ప్రజా సమస్యలు తీర్చే నిలయాలుగా ఉంటాయని చెప్పుకొచ్చారు. భాజపా కార్యాలయ పునాది రాళ్లు.. సమీప రోజుల్లో తెరాస ప్రభుత్వానికి సమాధి రాళ్లవుతాయని లక్ష్మణ్ ధ్వజమెత్తారు. జనవరి 1 నుంచి ప్రభుత్వ వైఫల్యాలపై వీధి పోరాటాలు చేస్తామన్నారు.