తెలంగాణ

telangana

రోడ్డు ప్రమాదంలో వస్త్ర వ్యాపారి రఘు మృతి

భూదాన్ పోచంపల్లికి చెందిన ప్రముఖ వస్త్ర వ్యాపారి, మాజీ టై అండ్ డై అధ్యక్షుడు పెండం రఘు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఆయన మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు.

By

Published : Sep 6, 2020, 9:03 AM IST

Published : Sep 6, 2020, 9:03 AM IST

textile merchant pendam raghu died in a bike accident at bhoodan pochampally yadadri  district
ప్రముఖ వస్త్ర వ్యాపారి రఘు మృతి

యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లిలోని మార్కండేయ నగర్​కాలనీలో ప్రముఖ వస్త్ర వ్యాపారి, మాజీ టై అండ్ డై అధ్యక్షుడు పెండం రఘు(62) నివాసముంటున్నారు. తన ఇంటి వద్దే జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు.

ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందారు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఆయన మృతి పట్ల పలువురు పట్టణ వాసులు సంతాపం వ్యక్తం చేశారు.

ఇవీ చూడండి: మంత్రి హరీశ్‌రావుకు కరోనా పాజిటివ్

ABOUT THE AUTHOR

...view details