యాదాద్రి భువనగిరి రాజాపేట మండలంలోని గోపాల్ చెరువులో గంగపుత్ర సంఘం సభ్యులు తెప్పోత్సవ కార్యక్రమం నిర్వహించారు. విస్తారంగా వర్షాలు కురిసి మండలంలోని చెరువులన్నీ నిండి అలుగుపారడం వల్ల ఈ కార్యక్రమం నిర్వహించినట్లు వారు తెలిపారు.
గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. డప్పు చప్పుళ్లతో సాంప్రదాయబద్ధంగా గ్రామంలో ప్రదర్శన చేపట్టారు. సుమారు నాలుగైదు గంటల పాటు ఊరేగింపు నిర్వహించారు. తెప్ప పీఠానికి మహిళలు ప్రత్యేక స్వాగతం పలికి పూజలు చేశారు.