యాదాద్రి జిల్లా భువనగిరి పట్టణంలో రోడ్డు విస్తరణ కార్యక్రమాన్ని మున్సిపల్ అధికారులు ప్రారంభించారు. మొదటగా హైదరాబాద్-వరంగల్ వెళ్లే మార్గంలో శిల్పా హోటల్ నుంచి జేసీబీ సాయంతో అక్రమ నిర్మాణాల తొలగింపు ప్రక్రియను చేపట్టారు. ముందుగా 50 అడుగులు విస్తరణ కోసం అయిన నిర్మాణాలను తొలగిస్తున్నామని మున్సిపల్ కమిషనర్ పూర్ణ చందర్రావు తెలిపారు.
ముందస్తు సమాచారం లేకుండా కూల్చివేతలు చేపడుతున్నారని.. నిర్మాణాల తొలగింపు ఆపాలని భాజపా, కాంగ్రెస్ నేతలు అధికారులతో వాగ్వాదానికి దిగారు. కొద్ది సేపు రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. అయినా నిర్మాణాల తొలగింపును అధికారులు కొనసాగించారు.