తెలంగాణ

telangana

ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంఘీభావం తెలిపిన తమ్మినేని

By

Published : Oct 25, 2019, 8:49 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సంఘీభావం తెలిపారు. ఆర్టీసీ కార్మికులకు వామపక్షాల మద్దతు సంపూర్ణంగా ఉంటుందన్నారు.

ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంఘీభావం తెలిపిన తమ్మినేని

హుజూర్​నగర్ ఉపఎన్నికల్లో తెరాస గెలుపు అనంతరం ఆర్టీసీ కార్మికుల గురించి సీఎం కేసీఆర్ ఇష్టం వచ్చిన విధంగా మాట్లాడుతున్నారని సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ధ్వజమెత్తారు. యాదగిరిగుట్టలో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంఘీభావం తెలిపారు. యాదగిరిగుట్ట బస్టాండ్ ముందు తమ్మినేని ఆందోళనకు దిగారు. ఆర్టీసీ కార్మికుల విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మైండ్ గేమ్ ఆడుతూ... బెదిరింపు ధోరణితో కార్మికులను లొంగదీసుకునే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. ఆర్టీసీలో ఏ ఒక్క కార్మికునికి కేసీఆర్ ఉద్యోగం ఇవ్వలేదని... ఆర్టీసీ కార్మికులను తొలగించడానికి సంస్థ కేసీఆర్ సొంత ఆస్తి కాదని విమర్శించారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు వామపక్షాల మద్దతు సంపూర్ణంగా ఉంటుందని తెలిపారు.

ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంఘీభావం తెలిపిన తమ్మినేని

ABOUT THE AUTHOR

...view details