యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఆలయ కార్యనిర్వాహణాధికారి గీతారెడ్డితో పాటు ఆలయ సిబ్బంది ఉత్సవాల్లో పాల్గొన్నారు. మధ్యాహ్నం 12గంటల సమయంలో కొండపైన ప్రాంగణంలో.. రఘురాముడు.. సీతమ్మ మెడలో మాంగల్యధారణ చేశాడు.
ఈ కమనీయ దృశ్యాలను తిలకించేందుకు భారీగా భక్తులు తరలివచ్చారు.
యాదాద్రిలో వైభవంగా శ్రీరామ నవమి వేడుకలు - యాదాద్రిలో వైభవంగా శ్రీరామ నావమి వేడుకలు
రఘుకుల తిలకుని కల్యాణం యాదాద్రిలో వైభవంగా జరిగింది. వేదపండితుల మంత్రోచ్ఛారణ, భక్తుల జయజయధ్వానాల మధ్య సీతారాముల కల్యాణం కమనీయ దృశ్యకావ్యంగా నిలిచింది.
యాదాద్రిలో వైభవంగా శ్రీరామ నావమి వేడుకలు
ఇవీ చూడండి: సీతారాముల కల్యాణానికి ముస్తాబవుతోన్న భద్రాద్రి
Last Updated : Apr 13, 2019, 10:41 PM IST