తెలంగాణ

telangana

ETV Bharat / state

'మునుగోడు ఉపఎన్నికలో తెరాస, భాజపాలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశాయి' - స్రవంతి ప్రెస్​ మీట్​

Sravanthi on munugode bypoll defeat: మునుగోడు ఉపఎన్నికలో కాంగ్రెస్​ పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఆ పార్టీకి డిపాజిట్ కూడా గల్లంతైంది. ఫలితంపై నిన్నంతా మౌనంగా ఉన్న పాల్వాయి స్రవంతి ఇవాళ మీడియా ముందుకు వచ్చారు. కాంగ్రెస్​ ఓటమికి గల కారణాలను ఆమె తెలిపారు.

Sravanthi press meet
పాల్వాయి స్రవంతి

By

Published : Nov 7, 2022, 4:28 PM IST

Sravanthi on munugode bypoll defeat: తెరాస, భాజపా కలిసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన ఎన్నిక ఇది అని మునుగోడు కాంగ్రెస్​ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి తెలిపారు. మునుగోడులో భాజపా కోవర్టు రాజకీయాలు చేసిందని పరోక్షంగా కోమటిరెడ్డి బ్రదర్స్​పై విరుచుకుపడ్డారు. ఈ ఎన్నికలో మద్యం ఏరులై పారిందని వాపోయారు. ఫొటో మార్ఫింగ్​ చేసి సోషల్​ మీడియాలో పోస్టు చేయడం ఎంతో అనైతికమన్నారు. మునుగోడును తెరాస ప్రలోభాలతో గెలుచుకొందని పేర్కొన్నారు. ఈ ఉపఎన్నికలో తెరాస, భాజపా దాదాపు రూ.500 కోట్లు ఖర్చు చేశాయని ఆరోపించారు. ప్రజల కోసం జరిగిన ఎన్నికైతే ఇది కాదు అని తెలిపారు.

తమ మధ్యనే ఉంటూ పార్టీకి వెన్నుపోటు పొడిచిన వ్యక్తులపై అధిష్ఠానానికి ఫిర్యాదు చేశామని పాల్వాయి స్రవంతి తెలిపారు. త్వరలోనే వారిపై విచారణ జరుగుతుందని హెచ్చరించారు. పగలు, రాత్రి అన్న తేడా లేకుండా ముమ్మరంగా కాంగ్రెస్​ అభ్యర్థిగా మునుగోడు నియోజకవర్గం మొత్తం దాదాపు ప్రచారం చేయడం జరిగిందని ఆమె తెలిపారు. నియోజకవర్గంలోని ప్రతి గడపకు వెళ్లి ఓట్లను అభ్యర్తించానని, ఒక ఆడబిడ్డనైనా ప్రతి వాడవాడకు తిరిగి ప్రచారం చేశానని.. అయితే తాను ప్రజాబలంతో పోటీ చేస్తే తెరాస, భాజపా అభ్యర్థులు ధనం, అధికారంతో ప్రచారం సాగించారని ఆరోపించారు.

తెరాస, భాజపా కలిసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన ఎన్నిక ఇది. మద్యం ఏరులై పారిన ఎన్నిక ఇది. మునుగోడులో తెరాస ప్రలోభాలతో గెలిచింది. ఫొటో మార్ఫింగ్‌ చేసి సోషల్‌ మీడియాలో పోస్టు చేయడం అనైతికం. మునుగోడులో భాజపా కోవర్టు రాజకీయాలు చేస్తోంది. ఉప ఎన్నికలో తెరాస, భాజపా దాదాపు రూ.500 కోట్లు ఖర్చు చేశాయి. మునుగోడు ఉప ఎన్నిక ప్రజల కోసం జరిగింది కాదు. - పాల్వాయి స్రవంతి, మునుగోడు కాంగ్రెస్​ అభ్యర్థి

కాంగ్రెస్‌కు తొలిసారి అతితక్కువ ఓట్లు:2018 అసెంబ్లీ ఎన్నికల్లో 48.9 శాతం ఓట్లు పొందిన కాంగ్రెస్‌ ఈసారి 10.6 శాతానికి దిగజారింది. నియోజకవర్గం ఏర్పాటైన తర్వాత జరిగిన 12 ఎన్నికల్లో 10 సార్లు కాంగ్రెస్‌ పోటీ చేయగా తొలిసారిగా అతి తక్కువ ఓట్లు వచ్చాయి. 2018 శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 97,239 ఓట్లు రాగా ఈసారి 23,906కు పరిమితమైంది.

మునుగోడు కాంగ్రెస్​ అభ్యర్థి పాల్వాయి స్రవంతి

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details