తెలంగాణ

telangana

By

Published : Jun 2, 2020, 6:59 PM IST

ETV Bharat / state

ఏకాదశి పర్వదినాన... యాదాద్రీశునికి లక్షపుష్పార్చన

యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారికి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని లక్షపుష్పార్చన పూజలు నిర్వహించారు. బాలాలయ మండపంలో ఉత్సవ మూర్తులకు వివిధ రకాల పుష్పాలతో అర్చన చేశారు.

special pooja in yadadri temple
ఏకాదశి పర్వదినాన... యాదాద్రీశునికి లక్షపుష్పార్చన

ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారికి లక్ష పుష్పార్చన నిర్వహించారు. బాలాలయ మండపంలో స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు వివిధ రకాల పుష్పాలతో లక్ష పుష్పార్చన పూజలు చేశారు.

లాక్​డౌన్ నేపథ్యంలో భక్తులు లేకుండానే స్వామి వారికి ఏకాంత సేవలో ఈ కార్యక్రమం చేపట్టారు. లక్ష పుష్పార్చన పూజలను ప్రతి మాసంలో శుద్ధ ఏకాదశి, బహుళ ఏకాదశి రోజున నిర్వహించడం ఆనవాయితీ అని ఆలయ అర్చకులు తెలిపారు.

ఇవీ చూడండి:నీటిపారుదలపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష

ABOUT THE AUTHOR

...view details