తెలంగాణ

telangana

ETV Bharat / state

రూ. 4 లక్షలకుపైగా విలువగల గుట్కా ప్యాకెట్లు స్వాధీనం - బీబీనగర్​లో ఎస్వోటీ పోలీసుల దాడులు

యాదాద్రి జిల్లా బీబీనగర్​లో అక్రమంగా విక్రయిస్తున్న గుట్కా, పొగాకు ఉత్పత్తులను ఎస్వోటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ. 4,10,000 ఉంటుందని వెల్లడించారు. నిందితుడు పొద్దుటూరి నాగరాజుని అదుపులోకి తీసుకొని స్థానిక పోలీసులకు అప్పగించారు.

రూ. 4 లక్షలకుపైగా విలువగల గుట్కా ప్యాకెట్లు స్వాధీనం
రూ. 4 లక్షలకుపైగా విలువగల గుట్కా ప్యాకెట్లు స్వాధీనం

By

Published : Jul 20, 2020, 10:51 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండల కేంద్రంలోని ఓ కిరణా షాప్​లో అక్రమంగా విక్రయిస్తున రూ. 4,10,000 విలువ గల గుట్కా, పొగాకు ఉత్పత్తుల ప్యాకెట్లను ఎస్వోటీ పోలీసులు పట్టుకున్నారు. నిందితుడు పొద్దుటూరి నాగరాజుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

సాగర్, ఎస్ఆర్ 1, మిరాజ్, విమల్, స్వాగత్, బ్లూ బుల్, అంబర్ లాంటి పొగాకు ఉత్పత్తులును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసుకొని స్థానిక పోలీస్ స్టేషన్​లో అప్పగించారు.

ఇవీ చూడండి:తెలంగాణలో మరో ఎమ్మెల్యేకు కరోనా... కుటుంబ సభ్యులందరికీ పాజిటివ్

ABOUT THE AUTHOR

...view details