కరోనా మహమ్మారి ఉద్ధృతం అవుతున్న నేపథ్యంలో.. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలంలోని పొడిచేడు గ్రామంలో సర్పంచ్ పేలపూడి మధు సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారి చేయించారు.
పొడిచేడులో సోడియం హైపోక్లోరైట్ ద్రావణం పిచికారి - సోడియం హైపోక్లోరైట్ ద్రావణం
యాదాద్రి భువనగిరి జిల్లా పొడిచేడు గ్రామ సర్పంచ్ పేలపూడి మధు.. సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారి చేయించారు. గ్రామంలో కరోనా కేసులు ఎక్కువగా నమోదయ్యాయని.. ప్రజలు జాగ్రత్తలు పాటించాలని ఆయన సూచించారు.
![పొడిచేడులో సోడియం హైపోక్లోరైట్ ద్రావణం పిచికారి sodium hypochlorite solution, podichedu, yadadri bhuvanagiri](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-08:23:04:1620485584-tg-nlg-62-08-corona-av-ts10101-08052021195748-0805f-1620484068-830.jpg)
sodium hypochlorite solution, podichedu, yadadri bhuvanagiri
రాష్ట్రంలో కరోనా తీవ్రత విపరీతంగా పెరిగిపోతోందని.. గ్రామంలో కరోనా కేసులు ఎక్కువగా నమోదయ్యాయని సర్పంచ్ అన్నారు. ప్రజలందరూ జాగ్రత్తలు తీసుకోవాలని, అత్యవసర పరిస్థితుల్లోనే బయటకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో కసోజు రవి, భాస్కర్, అంజి, మల్లేశ్, ధనుంజయ, గణేశ్, లతీఫ్, శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: ఫైజర్తో ఈయూ అతిపెద్ద వ్యాక్సిన్ ఒప్పందం