యాదాద్రి శ్రీలక్ష్మి నరసింహ స్వామి కొండపైన అనుబంధ ఆలయం పర్వత వర్ధిని సమేత రామలింగేశ్వర స్వామి దేవాలయంలో శివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా శుక్రవారం ఉదయం శివబాలాలయంలో నిత్యహవనములు, శివనామ జపములు, నందీశ్వర పారాయణాలు, పంచసూక్త పఠనాలు, మూల మంత్ర జపములు, వివిధ పారాయణాలు నిర్వహించారు.
ఉదయం 11 గంటల నుంచి రెండు గంటల వరకు లక్ష బిల్వార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా సాయంకాలం స్వామి, అమ్మవార్ల రథోత్సవం జరిపారు. ఈ నెల 8న ప్రారంభించిన మహాశివరాత్రి ఉత్సవాలు 13వరకు జరగనున్నాయి.