తెలంగాణ

telangana

ETV Bharat / state

మూడు గొర్లపాకలు దగ్ధం.. గొర్రెలకు తప్పిన ప్రమాదం - యాదాద్రి భువనగిరి జిల్లా

యాదాద్రి భువనగిరిజిల్లా మోటకొండూరు మండల కేంద్రంలో 3 గొర్ల పాకలు దగ్ధమయ్యాయి. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలు ఆర్పివేశారు.

sheep's shed burned in yadadribhuvanagiri district
మూడు గొర్లపాకలు దగ్ధం.. గొర్రెలకు తప్పిన ప్రమాదం

By

Published : Feb 18, 2020, 2:36 PM IST

యాదాద్రి భువనగిరిజిల్లా మోటకొండూరులో సోమవారం మూడు గొర్లపాకలు దగ్ధమయ్యాయి. భూమండ్ల వెంకటేష్, బుడిగే సిద్ధయ్య, దడిగే సిద్ధులు అనే గొర్ల కాపరుల పాకల్లో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపులోకి తీసుకువచ్చారు.

గొర్రెలను రోజువారి మేతకు తీసుకువెళ్లిన తర్వాత ఈ ఘటన చోటుచేసుకోవడం వల్ల నష్టం తగ్గిందని గొర్రెల కాపరులు అన్నారు. కానీ తాము ఎంతో కష్టనష్టాలకోర్చి కొట్టాలను నిర్మించుకున్నామని ఒక్కొక్క కొట్టం నిర్మించుకోవడానికి సుమారుగా రూ. లక్ష నుంచి రూ.50 వేలు ఖర్చు అయ్యిందని వాపోయారు.

ఇప్పుడు తమ గొర్రెలను ఎక్కడ ఉంచాలని.. మళ్లీ గొర్ల పాక నిర్మించుకోవడానికి తమ ఆర్థిక స్థోమత సరిపోదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై అధికారులు స్పందించి తమకు సహాయం చేయాలంటూ బాధితులు కోరారు.

మూడు గొర్లపాకలు దగ్ధం.. గొర్రెలకు తప్పిన ప్రమాదం

ఇవీ చూడండి:మూడు వారాలుగా జలసమాధిలోనే ఎమ్మెల్యే సోదరి కుటుంబం!

ABOUT THE AUTHOR

...view details