ఆరోగ్య తెలంగాణ కోసం పారిశుద్ధ్య నిర్వహణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, ప్రజాప్రతినిధులతో పాటు ప్రజలూ పెద్దఎత్తున భాగస్వాములు కావాలని మున్సిపల్ ఛైర్మన్ శంకరయ్య అన్నారు. కరోనాతో పాటు ఇతర వ్యాధులపైనా అప్రమత్తంగా ఉండి, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పురపాలకశాఖ పరిధిలో మూడవ వార్డులో తడి, పొడి చెత్తల కోసం వేర్వేరుగా బుట్టలు పంపిణి చేశారు.
నిల్వనీటిని తొలగించాలి..