తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రిలో తెల్లవారుజామున ఒక్కసారిగా వర్షం కురిసింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వానతో.. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధి బాలాలయంలోకి వర్షపు నీరు(rain Water) వచ్చి చేరింది.
Rain Water : యాదాద్రి బాలాలయంలోనికి వర్షపు నీరు - yadadri temple
భానుడి తాకిడికి అల్లాడిపోతున్న జనం ఒక్కసారిగా చల్లబడ్డారు. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో ప్రజలు ఉక్కపోత నుంచి ఉపశమనం పొందారు. ఉదయం ఎడతెరిపి లేకుండా కురిసిన వానతో యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి బాలాలయంలోనికి నీరు(rain Water) చేరింది.
![Rain Water : యాదాద్రి బాలాలయంలోనికి వర్షపు నీరు rain water, rain water in yadadri, rain water in yadadri temple](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11996437-426-11996437-1622687966986.jpg)
వర్షపు నీరు, యాదాద్రి ఆలయంలోనికి వర్షపు నీరు, యాదాద్రి టెంపుల్లోకి వరద
ప్రధానాలయం వైపు గల తలుపు నుంచి బాలాలయంలోకి వర్షం నీరు(rain Water) చేరినట్లు సిబ్బంది తెలిపారు. ఈ నీరు..మెట్ల దారి గుండా, క్యూ లైన్లలోకి ప్రవహించింది. బాలాలయంలోకి వాననీరు చేరడం వల్ల ఉదయం స్వామివారి సుప్రభాత సేవ చేయడంలో అర్చకులు ఇబ్బందులు పడ్డారు. అనంతరం సిబ్బంది వర్షపు నీటికి బయటకు పంపించారు.