హాజీపూర్ వరుస హత్య కేసుల నిందితుడు మర్రి శ్రీనివాస్ రెడ్డి పోలీసు కస్టడీ... నేటితో పూర్తయింది. నల్గొండ న్యాయస్థానం ఆదేశాల మేరకు వరంగల్ కేంద్ర కారాగారం నుంచి ఈ నెల 8న అదుపులోకి తీసుకున్న రాచకొండ కమిషనరేట్ పోలీసులు... ఐదు రోజుల పాటు విచారించారు. ఆ గడువు ఇవాళ్టితో ముగియగా..... కస్టడీ అనంతరం నిందితుడిని పోలీసులు జిల్లా కోర్టులో హాజరుపరిచారు. అనంతరం శ్రీనివాస్ రెడ్డిని వరంగల్ కేంద్రకారాగారానికి తరలించారు.
నేటితో పూర్తైన సైకో శ్రీనివాస్రెడ్డి కస్టడీ - YADADRI
వరుస హత్యల నిందితుడు సైకో శ్రీనివాస్రెడ్డి పోలీసు కస్టడీ నేటితో పూర్తయింది. వరంగల్ కేంద్ర కారాగారం నుంచి కస్టడీకి తీసుకున్న యాదాద్రి పోలీసులు ఐదురోజుల పాటు నిందితుడిని విచారించారు. ఇప్పటికే ఈ కేసుపై పలు అంశాలు సేకరించినట్లు తెలుస్తుంది.
![నేటితో పూర్తైన సైకో శ్రీనివాస్రెడ్డి కస్టడీ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3266447-478-3266447-1557732616048.jpg)
నేటితో పూర్తైన సైకో శ్రీనివాస్రెడ్డి కస్టడీ
Last Updated : May 13, 2019, 1:52 PM IST