తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రశాంతంగా ఓటింగ్... వినియోగించుకుంటున్న ఓటర్లు - municipal election in yadadri

ఓటర్ల రాకతో పోలింగ్ కేంద్రాలు సందడిగా మారాయి. ఓటర్లకు ఇబ్బంది కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం మందకోడిగా సాగిన పోలింగ్.. ప్రస్తుతం వేగాన్ని పుంజుకున్నట్లు అధికారులు తెలుపుతున్నారు.

polling is continues in peace full way in yadadri bhuvanagiri district
ప్రశాంతంగా ఓటింగ్... వినియోగించుకుంటున్న ఓటర్లు

By

Published : Jan 22, 2020, 12:38 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మున్సిపాలిటీ పరిధిలో 35వ వార్డులో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం ఏడు గంటలకే పోలింగ్ ప్రారంభమైనప్పటికీ... 9 గంటల తర్వాత నుంచి ఓటర్లు కేంద్రాలకు తరలి వస్తున్నారు.

ప్రశాంతంగా ఓటింగ్... వినియోగించుకుంటున్న ఓటర్లు
ఓటర్ల రాకతో పోలింగ్ కేంద్రాల వద్ద సందడి వాతావరణం నెలకొంది. అవాంఛనీయ ఘటనలు జరగకుండా కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. ప్రస్తుతం విలీన గ్రామాలతో కలిపి భువనగిరి మున్సిపాలిటీ పరిధిలో ఉన్న అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details