తెలంగాణ

telangana

By

Published : Oct 31, 2020, 9:05 AM IST

ETV Bharat / state

పాలకుర్తిలో కేసీఆర్​ పర్యటన.. భువనగిరిలో పోలీసుల పటిష్ట భద్రత

ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం జనగామ జిల్లా పాలకుర్తి పర్యటన నేపథ్యంలో పోలీసుల యంత్రాంగం అప్రమత్తమయ్యింది. యాదాద్రి భువనగిరి మీదుగా రోడ్డు మార్గం ద్వారా వెళ్లనున్న క్రమంలో పటిష్ట బందోబస్తు చేపట్టారు.

Police security for CM's visit to Janagama district Palakurthi
పాలకుర్తిలో సీఎం కేసీఆర్​ పర్యటన.. భువనగిరిలో పోలీసుల పటిష్ట భద్రత

సీఎం కేసీఆర్​ యాదాద్రి భువనగిరి జిల్లా మీదుగా జనగామ జిల్లా పాలకుర్తి వెళ్తున్నట్లు సమాచారం మేరకు పోలీస్ యంత్రాంగం అప్రమత్తమయ్యింది. జిల్లాలో సీఎం ప్రయాణించే రోడ్డు మార్గంలో పోలీసులు పటిష్ట భద్రతా చర్యలు చేపట్టారు.

జగదేవ్​పూర్ నుంచి తుర్కపల్లి, భువనగిరి, ఆలేరు మీదుగా సీఎం కాన్వాయ్ వెళ్లనుంది. సీఎం భద్రత కోసం 250 మంది పోలీసు సిబ్బందితో పాటు, ఒక డీసీపీ, ముగ్గురు ఏసీపీలు, ఐదుగురు సీఐలు, ఎనిమిది మంది ఎస్సైలు బందోబస్తు నిర్వహిస్తున్నారు.

ఇదీ చూడండి:దేశానికి ఎప్పటికైనా అన్నం పెట్టే సత్తా కేవలం తెలంగాణదే: మంత్రి ఈటల

ABOUT THE AUTHOR

...view details