తెలంగాణ

telangana

ETV Bharat / state

పేకాట స్థావరాలపై పోలీసుల దాడి - మోత్కూరులో పోలీసుల దాడులు

యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ కేంద్రంలో పేకాట స్థావరాలపై పోలీసులు దాడులు చేపట్టారు. పోలీసులు రాకతో అప్రమత్తమైన పేకాటరాయుళ్లు అక్కడి నుంచి పరారయ్యారు.

పేకాట స్థావరాలపై పోలీసుల దాడి
పేకాట స్థావరాలపై పోలీసుల దాడి

By

Published : Sep 10, 2020, 11:11 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో పేకాట స్థావరాలపై పోలీసుల దాడులు నిర్వహించారు. మోత్కూర్ మున్సిపాలిటీ కేంద్రంలో పేకాటలో బెట్టింగ్ నిర్వహిస్తున్నారనే విశ్వసనీయ సమాచారంతో పోలీసులు దాడులు చేయగా... పేకాటరాయుళ్లు పరారయ్యారు.

ఘటన స్థలంలో ఆటకు ఉపయోగించిన కార్డులు, రూ. 3,460 నగదు, మూడు చరవాణులు, ఆరు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. అసాంఘిక కార్యకలాపాలకు ఎవరు పాల్పడ్డా శిక్షార్హులే అని ఎస్ఐ హెచ్చరించారు.

ఇదీ చూడండి: ఓ రైతుకు పొలంలో కనిపించిన వింత తాబేలు

ABOUT THE AUTHOR

...view details