యాదాద్రి జిల్లా తుర్కపల్లికి చెందిన ఓ కరోనా బాధితుడి కుటుంబం.. హోం క్వారంటైన్లో ఉంటూ నిత్యావసరాలు లేక ఆకలితో అలమటించిపోయింది. సాటి మనిషి పట్ల.. దయ, కరుణ చూపని కాలనీ వాసులతో మనోవేదనకు గురైంది. ‘మమ్మల్ని ఎవరూ పట్టించుకోవడం లేదు.. దయచేసి సాయం చేయండి’ అంటూ స్థానిక పీఎస్కు ఫోన్ చేసింది. స్పందించిన ఎస్సై.. నేనున్నానంటూ ముందుకొచ్చి బాధితులకు నిత్యావసరాలు అందజేశారు.
కరోనా బాధితుల కోసం కదిలి వచ్చిన ఎస్సై - కరోనా రెండో దశ
తిండి కోసం ఆ ఇంటివారు అలమటించిపోయారు. నిత్యావసరాల కోసం బయటకు వెళ్లలేని పరిస్థితితో అల్లాడిపోయారు. సాటి మనిషి పట్ల కనికరం చూపని కాలనీ వాసులుతో విసిగిపోయారు. వేరే దిక్కు లేక స్థానిక పీఎస్కు కాల్ చేశారు. పెద్ద మనసుతో ముందుకొచ్చిన ఎస్సై.. ఆ కొవిడ్ బాధితులకు నిత్యావసరాలతో పాటు కావాల్సినంత ధైర్యమిచ్చి వెళ్లారు.
police helps covid effected people
బాధితుల ఆకలి తీర్చిన ఎస్ఐ మధుబాబుకు.. ఆ కుటుంబం కృతజ్ఞతలు తెలిపింది. విషయం తెలుసుకున్న చుట్టుపక్కల వారంతా.. ఎస్సై చేసిన మంచి పనికి ప్రత్యేకంగా అభినందించారు. కొవిడ్ బాధితుల పట్ల అందరూ సానుభుతి చూపాలని... ఆపత్కాలంలో వారిని ఆదుకోవాలని ఎస్సై మధుబాబు సూచించారు.