తెలంగాణ

telangana

By

Published : Mar 21, 2021, 10:47 AM IST

ETV Bharat / state

యాదాద్రిలో సింహవాహనంపై కనువిందు చేసిన నారసింహుడు

యాదాద్రి లక్ష్మీనారసింహుని బ్రహ్మోత్సవాల్లో భాగంగా సింహవాహనంపై స్వామివారు ఊరేగారు. స్వయంభువులకు ఉత్సవ ఆరాధనలు జరిపారు.

yadadri news
యాదాద్రిలో సింహవాహనంపై కనువిందు చేసిన నారసింహుడు

ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి నారసింహుని సన్నిధిలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ప్రతి రోజు ఉదయం, రాత్రి వేళల్లో స్వామి, అమ్మవార్లను వివిధ రకాల పుష్పాలతో అలకరించి వాహన సేవ నిర్వహిస్తున్నారు.

సింహ వాహనంపై శ్రీలక్ష్మీనారసింహుడు

ఆరో రోజు ఉత్సవాల్లో భాగంగా.. సింహవాహనంపై ఉగ్రనరసింహుడు భక్తులకు దర్శనమిచ్చారు. వేదపండితులు సింహవాహన సేవ విశిష్టతను భక్తులకు వివరించారు.

ఇవీచూడండి:ఈ వేసవి కాలం నిప్పు రేగితే నీరేది?

ABOUT THE AUTHOR

...view details