యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా సహకార ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. ఓట్లు వేయడానికి పోలింగ్ కేంద్రాల వద్దకు ఓటర్లు భారీగా చేరుకుంటున్నారు. ఫలితంగా పోలింగ్ కేంద్రాల వద్ద సందడి వాతావరణం నెలకొంది.
జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా పోలింగ్
యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా సహకార సంఘాల ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి.
జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా పోలింగ్
జిల్లా వ్యాప్తంగా 21 సొసైటీలు ఉండగా.. 194 వార్డులు ఉన్నాయి. అందులో 79 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 115 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. సుమారు 45 వేల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇదీ చూడండి:చింతలపల్లి ఎక్స్ప్రెస్ ఎక్కితే గురుకుల సీటు ఖాయం