తెలంగాణ

telangana

ETV Bharat / state

గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలంటూ పాదయాత్ర - padayatra to declare cow as national festival

తితిదే బోర్డు సభ్యులు శివకుమార్​ హైదరాబాద్​ నుంచి చేపట్టిన పాదయాత్ర యాదాద్రి భువనగిరి జిల్లాకు చేరుకుంది. గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలనే ఉద్దేశంతో ఈ పాదయాత్ర చేపట్టినట్లు శివకుమార్​ వెల్లడించారు.

padayatra to declare cow as national animal till yadadri bhuvangiri district
గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలంటూ పాదయాత్ర

By

Published : Nov 6, 2020, 8:56 PM IST

గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని డిమాండ్​ చేస్తూ యుగ తులసి ఫౌండేషన్​ ఆధ్వర్యంలో తితిదే బోర్డు సభ్యులు శివకుమార్​ హైదరాబాద్​ నుంచి యాదాద్రి వరకు పాదయాత్ర చేపట్టారు. శుక్రవారం గో మహా పాదయాత్ర యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణానికి చేరుకుంది. బీబీనగర్​ మండల శివారులో యువ తెలంగాణ పార్టీ అధ్యక్షులు జిట్టా బాలకృష్ణారెడ్డి ఘనస్వాగతం పలికారు.

గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించే వరకు తాము వివిధ రూపాల్లో పోరాటం చేస్తామని బాలకృష్ణారెడ్డి వివరించారు. పాదయాత్రకు బీబీనగర్​ పీఏసీఎస్ ఛైర్మన్, రాష్ట్ర హిందూవాహిని నాయకులు, హిందూ దేవాలయ పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు తదితరులు సంఘీభావం ప్రకటించారు.

ఇదీ చదవండిఃధరణితో 15నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్​ ప్రక్రియ పూర్తి: యాదాద్రి కలెక్టర్​

ABOUT THE AUTHOR

...view details