యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రంలో ఆదివారం రద్దీ సాధారణంగా కనిపించింది. ఆర్జిత సేవల్లో భక్తులు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కులు సమర్పించారు. స్వామి వారికి నిత్య పూజా కైంకర్యాలు శాస్త్రోక్తంగా కొనసాగాయి.
అభిషేకం, అర్చనలు, హోమం, నిత్య కల్యాణ వేడుకలు నిర్వహించారు. థర్మల్ స్క్రీనింగ్, శానిటైజేషన్ తర్వాతే ఆలయంలోకి అధికారులు అనుమతిస్తున్నారు. భౌతిక దూరం పాటిస్తూ భక్తులు స్వామి వారిని దర్శించుకుంటున్నారు.