యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండటం వల్ల కరోనా అక్కడ అడుగుపెట్టలేకపోయింది. బీబీనగర్ ఎయిమ్స్ క్వారంటైన్లో ఉన్న 28 మందికి జరిపిన కొవిడ్-19 నిర్ధరణ పరీక్షల్లో 24 మందికి నెగిటివ్ అని తేలింది. మరో ఇద్దరి ఫలితాలు రావాల్సి ఉదని జిల్లా వైద్యారోగ్య అధికారి సాంబశివరావు తెలిపారు.
ఆలేరు బస్టాండ్లో మతిస్థిమితం సరిగ్గాలేని ఓ తమిళ మహిళకు కరోనా సోకిందనే అనుమానంతో ఆమె శాంపిల్స్ సేకరించి హైదరాబాద్కు పంపించారు దాని ఫలితం నెగిటివ్గా వచ్చిందని సాంబశివరావు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా 52 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించగా, వారందరికీ నెగిటివ్ ఫలితమే వచ్చిందని చెప్పారు.