యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని మహా దివ్యంగా రూపొందించే క్రమంలో సరికొత్త విద్యుత్ కాంతులు విరజిమ్మేలా ప్రత్యేక లైటింగ్ ఏర్పాటు చేస్తున్నారు. మధ్యప్రదేశ్లోని ద్వారకా కంపెనీ నుంచి బ్యాలెట్ లైట్లను రప్పిస్తున్నారు. ఆలయం నలు వైపులా మాడ వీధుల్లో అల్యూమినియం, ఇత్తడి లోహంతో తయారైన... 160 లైట్ల బిగింపునకు యాడా నిర్ణయించింది.
సీఎం కేసీఆర్ రేపు రానున్న సందర్భంగా 74 లైట్లను మంగళవారం తీసుకొచ్చారు. వాటిని ఇన్స్టాల్ చేసే పనులను చేపడుతున్నారు. సంప్రదాయ హంగులతో ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రంగా యాదాద్రిని తీర్చిదిద్దుతున్నారు.