తెలంగాణ

telangana

By

Published : Mar 27, 2021, 12:29 PM IST

ETV Bharat / state

'ఎయిమ్స్ సేవలు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి'

యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ ఎయిమ్స్‌లో రెండు ల్యాబ్‌లను ఆ ఆస్పత్రి డైరెక్టర్ వికాస్ భాటియా ప్రారంభించారు. ఎయిమ్స్ సేవలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పూర్తి స్థాయి వైద్య సేవలు అందించే దిశగా పనులు కొనసాగుతున్నాయని వివరించారు.

new labs inaugurated in bibinagar aims, yadadri bhuvanagiri news
బీబీనగర్ ఎయిమ్స్ నూతన ల్యాబ్‌లు, యాదాద్రి భువనగిరి జిల్లా తాజా వార్తలు

ఎయిమ్స్ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ వికాస్ భాటియా సూచించారు. పూర్తి స్థాయి వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా పనులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ ఎయిమ్స్‌లో మాలిక్యులర్ ల్యాబ్‌ని... అనంతరం బెంగుళూరులోని ఎంవీజే వైద్య కళాశాల ఛైర్మన్ డాక్టర్ వసంత్ కుమార్‌తో కలిసి ఓపీడీ విభాగంలో కెమిస్ట్రీ ల్యాబ్‌ను ఆయన ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో ఎయిమ్స్ డీన్ నీరజ్ అగర్వాల్, డాక్టర్ మనోహర్ కందగట్ల, సుబ్బయ్య షణ్ముఖం, డాక్టర్ గోవింద్, డాక్టర్ శ్యామల తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:వెయ్యి కోట్ల ప్రభుత్వ భూమి కబ్జా.. వెల్లడించిన కాగ్ నివేదిక

ABOUT THE AUTHOR

...view details