తెలంగాణ

telangana

వారం వ్యవధిలో తల్లీకూతురు మృతి.. పీపీఈ కిట్లతో అంత్యక్రియలు

యాదాద్రి భువనగిరి జిల్లా చిర్రగూడూరులో తల్లీకూతురు వారం రోజుల వ్యవధిలో మృతి చెందారు. తల్లి అంత్యక్రియలకు వచ్చిన కూతురు నిద్రలోనే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

By

Published : May 5, 2021, 9:39 AM IST

Published : May 5, 2021, 9:39 AM IST

mother and daughter dead, mother and daughter dead with ill
వారం రోజుల్లో తల్లికూతురు మృతి, యాదాద్రి భువనగిరి లేటెస్ట్ న్యూస్

యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగుడూరు మండలం చిర్రగూడూరులో వారం రోజుల వ్యవధిలోనే తల్లీకూతురు మృతి చెందారు. తల్లి అంత్యక్రియల కోసం ముంబయి నుంచి వచ్చిన కూతురు నిద్రలోనే ప్రాణాలు కోల్పోయారు. కరోనాతో మృతి చెందిందనే అనుమానంతో ఆ మహిళకు కుటుంబ సభ్యులు పీపీఈ కిట్లు ధరించి ఎడ్లబండిపై తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. అనంతరం కుటుంబ సభ్యులంతా కొవిడ్ పరీక్షలు చేయించుకోగా... నెగిటివ్ అని తేలింది.

గ్రామానికి చెందిన పర్రెపాటి గంగమ్మ (75) వారం రోజుల క్రితం అనారోగ్యంతో మృతిచెందారు. ముంబయిలో ఉంటున్న మృతురాలి కూతురు ఐలమ్మ అలియాస్ రాములమ్మ (52) తల్లి అంత్యక్రియలకు హాజరైంది. ఆ నాటి నుంచి గ్రామంలోనే ఉంది. మంగళవారం ఉదయం మృతి చెందింది. ఈ ఆకస్మిక మరణంతో కరోనా సోకిందని కుటుంబ సభ్యులు భావించారు. కుటుంబ సభ్యులకు కరోనా పరీక్షలు చేయగా... అందరికీ నెగిటివ్ వచ్చినట్లు వైద్యసిబ్బంది తెలిపారు. తల్లి మృతిచెందిన వారం రోజులకే కూతురు మృతి చెందడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

ఇదీ చదవండి:సూది మందు పంపుతామని.. చుక్కలు చూపుతున్నారు

ABOUT THE AUTHOR

...view details