తెలంగాణ

telangana

By

Published : Jul 24, 2020, 4:42 PM IST

ETV Bharat / state

రైతు వేదిక భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండల పరిధిలోని చీమలకొండూరు గ్రామంలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్​ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే పైళ్ల శేఖర్​ రెడ్డిలు కలిసి రైతువేదిక భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

MLC Palala Rajeshwar Reddy Starts Raithu Vedika Construction work
రైతు వేదిక భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం చీమలకొండూరు గ్రామంలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్​ రెడ్డి, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్​ రెడ్డిలు రైతు వేదిక భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. తెరాస వర్కింగ్​ ప్రెసిడెంట్​, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా కార్యకర్తలతో కలిసి కేక్​ కట్​ చేశారు. అనంతరం మొక్కలు నాటారు. రైతు వేదికల నిర్మాణం తెలంగాణ రైతాంగానికి ఎంతగానో ఉపయోగపడుతాయని, పల్లా రాజేశ్వర్​ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్​ రెడ్డి, జిల్లా పార్టీ నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details