తెలంగాణ

telangana

By

Published : Sep 7, 2020, 6:58 AM IST

ETV Bharat / state

మృతురాలి కుటుంబానికి ఎమ్మెల్యేల పరామర్శ!

యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేటకు చెందిన వ్యాపారులు పుల్లూరి వెంకటేశం, ఉపేందర్​ల మాతృమూర్తి ఇటీవల మరణించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్​ రెడ్డి, చిరుమర్తి లింగయ్యలు మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించి, సంతాపం తెలిపారు. ఆమె చిత్రపటం ముందు పుష్పాలు వేసి నివాళులు అర్పించారు.

MLAs  Pailla Shekhar Reddy, Chirumarthi Lingaiah Visitation to the family members of the deceased
మృతురాలి కుటుంబానికి ఎమ్మెల్యేల పరామర్శ!

యాదాద్రి భువనగిరి జిల్లాలోని రాజాపేటకు చెందిన ప్రముఖ వ్యాపారులు పుల్లూరి వెంకటేశం, ఉపేందర్​ల మాతృమూర్తి అనంత లక్ష్మీ ఇటీవల మృతి చెందారు. విషయం తెలుసుకున్న భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్​ రెడ్డి, నకిరేకల్​ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యలు వారి కుటుంబాన్ని పరామర్శించి సంతాపం తెలిపారు. ఆమె చిత్రపటం ముందు పుష్పాలు వేసి నివాళులు అర్పించారు. అనంతలక్ష్మీ మరణానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యేల వెంట జెడ్పీటీసీ చామకూర గోపాల్ గౌడ్, బొల్ల కొండల్ రెడ్డి, మదర్ డైరీ డైరెక్టర్ వెంకట్రాంరెడ్డి రెడ్డి, కాకళ్ల ఉపేందర్, ఆడెపు శ్రీశైలం, కనకరాజు, సిద్ధులు, జశ్వంత్, తదితరులు ఉన్నారు.

ఇదీ చదవండి:"నా సొరకాయలు పోయాయి సార్..!"

ABOUT THE AUTHOR

...view details