తెలంగాణ

telangana

ETV Bharat / state

ముస్లిం సోదరులకు రంజాన్​ తోఫా - MLA Shekar reddy Distributes Ramzan Thofa for poor peoples

ప్రభుత్వ ఆదాయం తగ్గినా, కరోనా నేపథ్యంలో వితప్కర పరిస్థితి వచ్చినా పేదలను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రత్యేకంగా కృషి చేస్తున్నారని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్​ రెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్​ పోచంపల్లిలోని పేద ముస్లిం కుటుంబాలకు రంజాన్​ తోఫా పంపిణీ చేశారు.

MLA Distributes Ramzan Thofa
ముస్లింలకు రంజాన్​ తోఫా

By

Published : May 21, 2020, 5:31 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లిలో రంజాన్ పండుగ సందర్భంగా పేద ముస్లిం కుటుంబాలకు బియ్యం, నిత్యావసర సరుకులు, దుస్తువులను ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి పంపిణీ చేశారు. లాక్​డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన వారికి సాయం చేయడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు.

అనంతరం పట్టణంలోని చేనేత కార్మికుల ఇళ్లలోని పేరుకుపోయిన పట్టు చీరలు, వస్త్ర నిల్వలను ఆయన పరిశీలించారు. వారి సమస్యలు మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తామని నేతన్నలకు హామీ ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details