తెలంగాణ

telangana

ప్రణబ్​ ముఖర్జీ మరణం దేశానికి తీరని లోటు: గొంగిడి సునీత

By

Published : Sep 1, 2020, 7:31 AM IST

Updated : Sep 1, 2020, 8:12 AM IST

మాజీ రాష్ట్రపతి ప్రణబ్​ముఖర్జీని తెలంగాణ సమాజం ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని ప్రభుత్వ విప్​ గొంగిడి సునీత మహేంందర్​రెడ్డి అన్నారు. ఆయన మరణం దేశానికి తీరని లోటని దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.

mla gongidi sunitha spoke on pranab mukerji
ప్రణబ్​ ముఖర్జీ మరణం దేశానికి తీరని లోటు: గొంగిడి సునీత

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మరణం దేశానికి తీరని లోటని ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఆయన మరణం పట్ల సంతాపం ప్రకటించారు. తెలంగాణ సమాజం ప్రణబ్​ముఖర్జీని ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని చెప్పారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అప్పటి యూపీఏ ప్రభుత్వం వేసిన కమిటీకి ప్రణబ్ ముఖర్జీయే ఛైర్మన్ అని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లు ప్రణబ్​ముఖర్జీ రాష్ట్రపతిగా ఉన్నప్పుడే ఉభయ సభల్లో ఆమోదం పొందిందని అన్నారు. అటువంటి మహానేత మరణంతో ఏర్పడ్డ లోటు పూడ్చలేనిదన్నారు..


ఇవీ చూడండి: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అంత్యక్రియలు నేడే

Last Updated : Sep 1, 2020, 8:12 AM IST

ABOUT THE AUTHOR

...view details