యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలంలోని పలు గ్రామాల్లోని నిరుపేద ముస్లిం కుటుంబాలకు ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్రెడ్డి రంజాన్ తోఫా అందించారు. మల్లాపురం, సైదాపురం, జంగంపల్లి,దాతర్పల్లి గ్రామాల్లో ముస్లిం సోదరులకు రంజాన్ కానుకను అందచేశారు.
ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా అందించిన ఎమ్మెల్యే - corona virus
యాదగిరిగుట్ట మండలంలోని పలు గ్రామాల్లో గల నిరుపేద ముస్లిం కుటుంబాలకు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్రెడ్డి రంజాన్ తోఫా అందజేశారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ముస్లిం సోదరులు ఇంటి వద్దే రంజాన్ ప్రార్థనలు చేసుకోవాలని సూచించారు.
![ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా అందించిన ఎమ్మెల్యే mla gongidi sunitha mahendarreddy distributed ramzan topha in yadadri bhuvanagiri district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7236872-834-7236872-1589716690653.jpg)
ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా అందించిన ఎమ్మెల్యే
అనoతరం గ్రామాల్లో పారిశుద్ధ్యం విధులు నిర్వహిస్తున్న సిబ్బందిని శాలువాతో సన్మానించి, వారికి శానిటైజర్లను పంపిణీ చేశారు. కరోనా నేపథ్యంలో గ్రామాల్లో వారు చేస్తున్న సేవలను కొనియాడారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ముస్లిం సోదరులు రంజాన్ ప్రార్థనలు తమ ఇళ్ల వద్దే చేసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరు మాస్క్ తప్పనిసరిగా ధరించాలని పేర్కొన్నారు.
ఇవీ చూడండి: 'కేంద్ర ప్యాకేజీ కూలీలకు పంచితే రోజుకూ రూ. 6-7'