తెలంగాణ

telangana

ETV Bharat / state

కాంట్రాక్టర్​పై ఎమ్మెల్యే సునీత ఆగ్రహం

బహుపేట రైల్వే అండర్​ బ్రిడ్జి పనులపై అలేరు ఎమ్మెల్యే సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు కాంట్రాక్టర్​కు ఫోన్​ చేసి పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.

By

Published : Oct 20, 2019, 5:26 PM IST

ఎమ్మెల్యే సునీత

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలంలోని బహుపేటకు వెళ్లే మార్గంలో రైల్వేలైన్ ఉంది. రైల్వేలైన్​ దాటడానికి గ్రామస్థులు పడుతున్న అవస్థ చూసిన ప్రభుత్వం అండర్​ బ్రిడ్జి మంజూరు చేసింది. పనులు నత్తనడకన సాగుతుండడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే గొంగిడి సునీత దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఆమె రైల్వే అండర్​ బ్రిడ్జి నిర్మాణాన్ని పరిశీలించారు. పనుల ఆలస్యంపై సదరు కాంట్రాక్టర్​కు ఫోన్​ చేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.

కాంట్రాక్టర్​పై ఎమ్మెల్యే సునీత ఆగ్రహం

ABOUT THE AUTHOR

...view details